YS Sharmila: ధ్వంసమైన కారులోనే షర్మిల నిరసన.. క్రేన్తో లిఫ్ట్ చేసి తరలించిన పోలీసులు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతిభవన్ ముట్టడికి కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. షర్మిల డ్రైవింగ్ సీట్లో ఉండగానే కారును పోలీసు క్రేన్ వాహనంతో లిఫ్ట్ చేసి తరలించారు.
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతిభవన్ ముట్టడికి కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. షర్మిల డ్రైవింగ్ సీట్లో ఉండగానే కారును పోలీసు క్రేన్ వాహనంతో లిఫ్ట్ చేసి తరలించారు. పోలీసుల వైఖరిపై వైతెపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు వైతెపా కార్యకర్తల ఆందోళనతో రాజ్భవన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది.
షర్మిల ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించారు. ఈ క్రమంలో తెరాసకు చెందిన స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్పై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ షర్మిల పాదయాత్రను తెరాస కార్యకర్తలు సోమవారం అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని.. పాదయాత్రను నిలిపివేయాలని షర్మిలను నర్సంపేట ఏసీపీ సంపత్రావు కోరగా ఆమె నిరాకరించారు. ఈ క్రమంలో శంకరాం తండా సమీపంలో నిలిపిన షర్మిల కారవాన్పై కొందరు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. పక్కనే ఉన్న ఇన్నోవా వాహనం అద్దాలనూ పగలగొట్టారు. అనంతరం షర్మిలను హైదరాబాద్ తరలించారు.
సోమవారం జరిగిన పరిణామాలకు నిరసనగా షర్మిల నేడు ప్రగతిభవన్కు బయల్దేరారు. నర్సంపేటలో ధ్వంసం చేసిన కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుని నిరసనకు వెళ్తుండగా పంజాగుట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వాహనం దిగాలని పోలీసులు కోరినప్పటికీ ఆమె వినలేదు. దీంతో ధ్వంసమైన కారు డ్రైవింగ్ సీట్లో షర్మిల కూర్చొని ఉండగానే పోలీసుల క్రేన్ను తెప్పించి అక్కడి నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా నామినేషన్లకు ముఖ్యులు
భాజపా లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. -
డీకే అరుణకు రూ.66.75 కోట్ల ఆస్తులు
మహబూబ్నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ (అరుంధతి) తన కుటుంబానికి రూ.66.75 కోట్ల విలువైన ఆస్తులు (రూ.26.47 కోట్ల చరాస్తులు, రూ.40.27 కోట్ల స్థిరాస్తులు) ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. -
ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు: నిరంజన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ తెలిపారు. -
పీసీసీ అధికార ప్రతినిధులకు లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలు
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు 28 మందిని కేటాయించింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్