Andhra News: ఆ మంత్రిని గెలిపించి తప్పు చేశాం: వైకాపా కార్యకర్త వీడియో వైరల్‌

కర్నూలుకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం ప్రజలకు చేసిందేమీ లేదంటూ వైకాపా కార్యకర్త విడుదల చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా ..

Published : 09 Feb 2022 14:04 IST

ఆలూరు: కర్నూలుకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం ప్రజలకు చేసిందేమీ లేదంటూ వైకాపా కార్యకర్త విడుదల చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్పరి మండలం కైరుప్పల గ్రామానికి చెందిన సుంకన్న అనే కార్యకర్త ఈ వీడియోను విడుదల చేశారు. గుమ్మనూరు జయరాంను గెలిపించి తప్పు చేశామని.. ఆలూరు నియోజకవర్గానికి ఆయన ఏమీ చేయలేదని సుంకన్న ఆ వీడియోలో విమర్శించారు. పదవులతో జయరాం కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని