Andhra News: అనంతపురం జిల్లాలో భాజపా పోరుయాత్రపై వైకాపా శ్రేణుల దాడి

అనంతపురం జిల్లాలో భాజపా పోరు యాత్ర చేస్తున్న నాయకులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. బొమ్మనహాళ్‌ మండలం దేవగిరిలో భాజపా నాయకులు, కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ప్రజాపోరు యాత్ర నిర్వహించారు. 

Published : 03 Oct 2022 01:22 IST

బొమ్మనహాళ్‌: అనంతపురం జిల్లాలో భాజపా పోరు యాత్ర చేస్తున్న నాయకులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. బొమ్మనహాళ్‌ మండలం దేవగిరిలో భాజపా నాయకులు, కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ప్రజాపోరు యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాలను భాజపా నేతలు ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో వైకాపా శ్రేణులు ఒక్కసారిగా భాజపా నేతలు, కార్యకర్తలపై దాడికి దిగారు. పోరుయాత్ర వాహనానికి ఏర్పాటు చేసిన మైక్‌లను కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న అనంతపురం జిల్లా భాజపా అధ్యక్షుడు శ్రీనివాసులు వెంటనే బొమ్మనహళ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే వైకాపా కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని