క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన వైకాపా అభ్యర్థి
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రలోభాలకు తెరలేపారు. 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైకాపా నుంచి పోటీ చేస్తున్న సురేశ్..
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రలోభాలకు తెరలేపారు. 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైకాపా నుంచి పోటీ చేస్తున్న సురేశ్.. యువ ఓటర్లను ఆకర్షించేలా క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. తన కార్యాలయంలోనే కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన ఆయన.. ఓటర్ల జాబితా ప్రకారం బ్యాట్లు, ఇతర క్రికెట్ సామగ్రి అందజేశారు. బహిరంగంగానే కిట్లు పంపిణీ చేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.