రఘురామపై అనర్హత వేటు వేయండి: వైకాపా

వైకాపాలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్‌ కొనసాగుతోంది. స్వపక్షంలో విపక్షంలా తయారైన రఘురామపై అనర్హత వేటు వేయాలని వైకాపా నేతలు గతంలోనే

Published : 24 Jun 2021 00:50 IST

దిల్లీ: వైకాపాలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్‌ కొనసాగుతోంది. స్వపక్షంలో విపక్షంలా తయారైన రఘురామపై అనర్హత వేటు వేయాలని వైకాపా నేతలు గతంలోనే లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై తాజాగా మరోసారి వైకాపా నేతలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని గతేడాది జులై 3న ఫిర్యాదు చేశామని, అనర్హత వేటులో అకారణంగా జాప్యం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశామని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అనర్హత వేటు వేయకపోవడం దురదృష్టకరమని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని