రాష్ట్రంలో తెదేపా శకం ముగిసింది: అంబటి

ఓటమి భయంతో పరిషత్‌ ఎన్నికలను తెదేపా బహిష్కరించిందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో..

Published : 03 Apr 2021 01:32 IST

అమరావతి: ఓటమి భయంతో పరిషత్‌ ఎన్నికలను తెదేపా బహిష్కరించిందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో తెదేపా శకం ముగిసిందని చెప్పారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఈసీ నీలం సాహ్ని రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారని చెప్పారు. భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీని కూడా చంద్రబాబు రద్దు చేస్తారన్నారు. ఇకనైనా తెదేపా తరఫున పోటీ చేసేవాళ్లంతా తప్పుకోవాలని అంబటి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని