Andhra News: వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు.. వాళ్ల చిట్టా విప్పుతా: మాజీ మంత్రి అనిల్‌

నెల్లూరు వైకాపాలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. సొంత పార్టీ నాయకులపై వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌

Published : 19 Aug 2022 01:46 IST

నెల్లూరు: నెల్లూరు వైకాపాలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. సొంత పార్టీ నాయకులపై వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక వర్గం నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైకాపాలో ఉండి ఒక నాయకుడు సిగ్గుమాలిన పనులు చేస్తున్నాడని మండిపడ్డారు. 

‘‘వైకాపాలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు. తెదేపా నేతలతో వారు నిత్యం మంతనాలు జరుపుతున్నారు. వారి ఫోన్‌కాల్‌ హిస్టరీ మొత్తం నా వద్ద ఉంది. వాళ్ల బండారం బయటపెడతా. మీ దగ్గర నుంచి ఎంతెంత నగదు వెళ్తుందో అన్నీ నాకు తెలుసు’’ అని పేరు చెప్పకుండా వైకాపా నాయకులపై విమర్శలు చేశారు. నెల్లూరులో తనను దెబ్బతీసేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని