Kotamreddy: కాసేపట్లో మళ్లీ మీడియా ముందుకు కోటంరెడ్డి

తన ఫోన్‌ ట్యాప్‌ చేశారంటూ ఆరోపణలు చేసిన వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి మీడియా ముందుకు రానున్నారు.

Updated : 03 Feb 2023 09:57 IST

నెల్లూరు: తన ఫోన్‌ ట్యాప్‌ (Phone Tapping) చేశారంటూ ఆరోపణలు చేసిన వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) మరోసారి మీడియా ముందుకు రానున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత నిర్వహించనున్న ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడనున్నారు. రెండు రోజుల క్రితం ఫోన్‌ ట్యాపింగ్‌ ఎలా చేశారనేదానిపై ఆధారాలు బయపెట్టిన కోటంరెడ్డిపై వైకాపా (YSRCP) నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

తెదేపాలోకి వెళ్లేందుకు ఉద్దేశపూర్వకంగానే  సీఎం జగన్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌పై ఆయన ఆరోపణలు చేశారంటూ వైకాపా నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు కోటంరెడ్డిపై విమర్శలకు దిగారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని.. అది రికార్డింగ్‌ మాత్రమేనని చెప్పారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి మీడియా సమావేశం  ప్రాధాన్యం సంతరించుకుంది. వైకాపా నేతలు చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా బదులివ్వనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని