జగన్ పాలనను చూసి ఓటేశారు: విజయసాయిరెడ్డి
ఏపీలో జరిగిన పుర, నగరపాలక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడం పట్ల ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. మద్దిలపాలెంలోని వైకాపా నగర కార్యాలయంలో మంత్రులు
విశాఖపట్నం: ఏపీలో జరిగిన పుర, నగరపాలక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడం పట్ల ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. మద్దిలపాలెంలోని వైకాపా నగర కార్యాలయంలో మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. పురపాలిక ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం ఐదు కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పుగా పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతు పలికారన్నారు. సీఎం జగన్ ప్రచారం చేయనప్పటకీ ఆయన పాలనను చూసి ప్రజలు ఓటేశారన్నారు.
ఏకగ్రీవాలను ఒప్పుకోబోమని చంద్రబాబు అన్నారని, మరి ఈ ఫలితాలు ఏం చెబుతున్నాయన్నది విశ్లేషించుకోవాలని హితవుపలికారు. ఏకగ్రీవాలు కాని చోట ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఆపడం ఎవరి వల్ల కాదన్నారు. విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో ఫలితాలు చూశాక కొంత అసంతృప్తి కలిగిందన్నారు. గాజువాక, భీమిలి, పెందుర్తి, విశాఖ దక్షిణంలో చాలా వార్డులను కోల్పోయామని, ఇది అనుకోని పరిణామమన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కారణాలు విశ్లేషించుకొని, నాయకులతో చర్చించి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా సరిదిద్దుకుంటామన్నారు. ఈ సందర్భంగా విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో వైకాపా గెలుపొందడానికి కృషిచేసిన కార్యకర్తలను, నాయకులను విజయసాయిరెడ్డి అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.