YSRCP: నామినేషన్లు దాఖలు చేసిన వైకాపా రాజ్యసభ అభ్యర్థులు

రాజ్యసభ స్థానాలకు వైకాపా తరఫున నలుగురు అభ్యర్థులు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు.

Published : 25 May 2022 17:29 IST

అమరావతి: రాజ్యసభ స్థానాలకు వైకాపా తరఫున నలుగురు అభ్యర్థులు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలో రిటర్నింగ్‌ అధికారి, శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో కలిసి వెళ్లి వైకాపా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్‌ పత్రాలతో పాటు బీఫారం, అఫిడవిట్‌, సెక్యూరిటీ డిపాజిట్‌లను ఆర్వోకి అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని