Agra: ఇద్దరు అనుకుంటే నలుగురు పుట్టారు!
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. ఎత్మాద్దౌలా ప్రాంతంలోని ప్రకాశ్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మనోజ్ భార్య ఖుష్బూకు నెలలు నిండడంతో ట్రాన్స్ యమునా కాలనీ ఫేజ్-1లోని
ఈనాడు, లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. ఎత్మాద్దౌలా ప్రాంతంలోని ప్రకాశ్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మనోజ్ భార్య ఖుష్బూకు నెలలు నిండడంతో ట్రాన్స్ యమునా కాలనీ ఫేజ్-1లోని అంబే ఆసుపత్రిలో చేర్పించారు. ప్రసవానికి ముందు ఖుష్బూకు డాక్టర్లు ఆల్టాస్రౌండ్ స్కానింగ్ చేశారు. అందులో కవలలు కనిపించారు. అనంతరం శస్త్రచికిత్స చేస్తున్న క్రమంలో కడుపులో నలుగురు శిశువులు (ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు) ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఆటోడ్రైవరు దంపతులకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు పుట్టినవారిని కలిపితే మొత్తం పిల్లల సంఖ్య ఏడుకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’