Crime News: గుడిలో నాలుక కోసేసుకున్న భక్తురాలు

ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలు విగ్రహం ముందే నాలుక కోసేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో వెలుగుచూసింది. మూఢనమ్మకంతో ఆమె చేసిన ఈ పనికి అక్కడున్నవారు షాకయ్యారు. బడా గ్రామానికి చెందిన 20 ఏళ్ల రాజ్‌కుమారీ పటేల్‌..

Updated : 25 Jun 2022 09:18 IST

లయానికి వచ్చిన ఓ భక్తురాలు విగ్రహం ముందే నాలుక కోసేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో వెలుగుచూసింది. మూఢనమ్మకంతో ఆమె చేసిన ఈ పనికి అక్కడున్నవారు షాకయ్యారు. బడా గ్రామానికి చెందిన 20 ఏళ్ల రాజ్‌కుమారీ పటేల్‌.. గురువారం తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉండే అమ్మవారి ఆలయానికి వచ్చింది. పూజ చేస్తుండగా ఉన్నట్లుండి యువతి తన నాలుకను కోసేసుకుని ఆ విగ్రహం పాదాల వద్దకు విసిరేసింది. యువతి వైఖరి చూసి తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న వారు షాకయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వైద్యులను వెంట పెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. అమ్మవారికి బలి ఇవ్వాలనే ఆలోచనతో ఆమె ఈ పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని