పీజీ వైద్య విద్య సీట్ల కేటాయింపుల్లో గందరగోళం
ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. పీజీ వైద్య విద్య ప్రథమ సంవత్సరం (ఎండీ/ఎంఎస్)లో ప్రవేశాలకు సంబంధించి తాత్కాలిక సీట్ల
ఉత్తమ ర్యాంకర్లకు దక్కని చోటు
విద్యార్థుల ఆందోళన.. జాబితా రద్దుచేసిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ
కొత్తగా ఆప్షన్లను ఇచ్చుకోవాలని సూచన!
సీట్ల కేటాయింపులో ‘తాత్కాలికం’పై అభ్యంతరాలు
ఈనాడు, అమరావతి, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం : ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. పీజీ వైద్య విద్య ప్రథమ సంవత్సరం (ఎండీ/ఎంఎస్)లో ప్రవేశాలకు సంబంధించి తాత్కాలిక సీట్ల కేటాయింపు(నాన్-సర్వీస్)లో తప్పులు దొర్లాయి. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్లకు విరుద్ధంగా సీట్లు కేటాయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తమ ర్యాంకులు వచ్చినప్పటికీ కొందరు విద్యార్థులకు అసలు సీట్లే దక్కలేదు. దీంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. చివరికి సాంకేతిక కారణాలతో సీట్ల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు బుధవారం రాత్రి విశ్వవిద్యాలయం ప్రకటించింది. మళ్లీ విద్యార్థులు బుధవారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటలలోగా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ విషయాన్ని కూడా బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రకటించడం గమనార్హం. వైద్య విద్యలో పరిమితంగా ఉండే పీజీ సీట్ల కోసం గట్టి పోటీ ఉంది. ఎంబీబీఎస్ చదువుతున్నప్పటి నుంచే పీజీ కోర్సుల కోసం సన్నద్ధమయ్యే విద్యార్థులు ఉంటారు. ఈ పరిస్థితుల్లో సీట్ల కేటాయింపు జరిగిన తీరుపై వారంతా ఆందోళన చెందుతున్నారు.
కావాల్సినంత సమయం ఉన్నా తప్పులేనా?
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ మెడికల్ (ఎండీ/ఎంఎస్) ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను గత డిసెంబరులోనే విశ్వవిద్యాలయం మొదలుపెట్టింది. ఈ బాధ్యతను కొత్తగా క్యూ-వెంచర్స్ అనే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. సీట్ మ్యాట్రిక్స్, రిజర్వేషన్ దామాషా ప్రకారం విద్యార్థులకు కళాశాలలు, స్పెషాల్టీల వారీగా సీట్ల కేటాయింపు జరగాలి. కానీ ఈ ప్రక్రియ మొత్తం గందరగోళంగా తయారైంది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చి చివర్లో సబ్మిట్ చేశారు. ఓటీపీ నంబర్ నమోదు చేశాక దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అయితే విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్లు పూర్తిస్థాయిలో సర్వరులో నమోదుకాలేదు. దీనివల్ల సీట్ల కేటాయింపు అస్తవ్యస్తంగా తయారైందని తెలుస్తోంది. జనవరి 24 నాటికి విద్యార్థుల నుంచి ఆప్షన్ల స్వీకరణ ముగిసింది. అప్పటి నుంచి సీట్ల కేటాయింపునకు తగిన సమయం తీసుకున్నా తప్పులు దొర్లడం గమనార్హం. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చేంత వరకు విశ్వవిద్యాలయం మేల్కొనకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ తప్పుల వెనుక ఏమైనా దురుద్దేశాలు ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం జరిగిన తాత్కాలిక సీట్ల కేటాయింపునకు సంబంధించిన వివరాల నోట్ను విశ్వవిద్యాలయ వెబ్సైట్ నుంచి బుధవారం తొలగించారు. సీట్ల కేటాయింపులో ‘తాత్కాలికం’ అని ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థుల అయోమయం!
ఇప్పటికే పీజీ వైద్య విద్యలో ప్రవేశాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై విచారణ కారణంగా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంలో తీవ్ర జాప్యం జరిగింది. దీనివల్ల తగిన సమయం అందుబాటులో ఉన్నా విశ్వవిద్యాలయం ఉపయోగించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సీట్ల కేటాయింపు జాబితా రద్దుచేసిన అధికారులు అందుకు దారితీసిన కారణాలు చెప్పడం లేదు. వివరణ కోరేందుకు ప్రయత్నించినా స్పందించలేదు.
* మరోవైపు జాతీయ స్థాయిలో సీట్లు పొందిన అభ్యర్థులు ఫిబ్రవరి మూడో తేదీలోగా అవసరంలేని సీట్లను వదులుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో మెరుగైన సీటు వస్తే జాతీయ స్థాయి సీటు వదులుకోవాలని చూసిన విద్యార్థులకు తాజా పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కౌన్సెలింగ్కు సాఫ్ట్వేర్ బాధ్యతలను చూసే సంస్థ సామర్థ్యం ఎంతుంది? అసలెందుకు ఇలా జరిగింది? పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తున్నారు? అన్న దానిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విశ్వవిద్యాలయ చరిత్రలో ఇలాంటి తప్పులు జరగడం తొలిసారి అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పరిణామాలపై ప్రభుత్వం కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఇదీ తెలియదా!
తెలంగాణలోని ఇన్సర్వీసు వైద్యులకు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పీజీ సీట్ల భర్తీలో విశ్వవిద్యాలయం అవకాశాన్ని కల్పించలేదు. ప్రత్యేక కమిటీ ద్వారా ఇన్సర్వీస్ వారికి సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారి, విశ్వవిద్యాలయం ఉపకులపతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు వెలువడిన ఉత్తర్వులను తెలంగాణలోని ఇన్సర్వీస్ వైద్యులు న్యాయస్థానంలో సవాల్చేశారు. దీంతో వారికి సానుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరి సీట్ల కేటాయింపును పక్కనపెట్టి నాన్ సర్వీస్ కోటా కింద 687 మంది విద్యార్థులతో కూడిన జాబితాను ‘తాత్కాలికం’ పేరుతో మంగళవారం రాత్రి వర్సిటీ ప్రకటించింది. రద్దుచేసింది. ఇది కూడా ఆందోళనలకు కారణమైంది.
* ఇప్పటికే జాతీయ స్థాయిలో మొదటి విడత నీట్ పీజీ ప్రవేశాలు పూర్తి కాగా తరగతులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. కానీ ఇక్కడ అభ్యర్థులకు సీట్ల కేటాయింపులే చేయలేదు. తమ పరిస్థితి ఏంటని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
యూజీ ప్రవేశాల్లోనూ గందరగోళం!
ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేద, హోమియో, యునానీ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది. విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత నుంచి విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. విద్యార్థులు తమ వివరాలు నమోదు చేయడంలో మల్లగుల్లాలు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ చేద్దామనుకుంటే నీట్ ర్యాంకులు మళ్లీ నమోదు చేయండని వస్తోంది. అలాగే కొంత మందికి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు సంబంధించి ఓటీపీలు రావడంలేదు. మెయిల్స్ రావడంలేదని, విశ్వవిద్యాలయం నుంచి ఎటువంటి సమాచారం లేదని, ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం లేదంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. దరఖాస్తు గడువు ఈనెల నాలుగో తేదీతో ముగియనున్న తరుణంలో గడువు పొడిగించాలని కోరుతున్నారు. జాతీయ వైద్య కమిషన్ ఈ నెల 14 నుంచి ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం