సీఎం జగన్ నిర్ణయాలతో రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తం
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని అమరావతి రైతులు మండిపడ్డారు. ప్రజల
అమరావతి రైతుల మండిపాటు
ఈనాడు డిజిటల్, అమరావతి, తుళ్లూరు గ్రామీణం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని అమరావతి రైతులు మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షను గుర్తించకుండా ఇష్టానుసారం నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని దుయ్యబట్టారు. నిత్యావసర ధరలు నింగినంటుతున్నా కనీస ఊరట చర్యలు లేవని, ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు, అధికారుల వరకు ప్రజల ఇబ్బందుల్ని పట్టించుకునే వారే లేరని వాపోయారు. ఉద్యోగాలు లేకుండా యువత ఇబ్బందులు పడుతున్నా పరిశ్రమలు తెచ్చే ఆలోచనే చేయడం లేదని మండిపడ్డారు. సంపద సృష్టించే అమరావతిని కాదని రాష్ట్రాన్ని ఇక్కట్ల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న నిరసనలు 866వ రోజు ఆదివారం కొనసాగాయి. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శిబిరాల్లో కార్మికుల సేవలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, అబ్బరాజుపాలెం, తాడికొండ, కృష్ణాయపాలెం శిబిరాలల్లో నిరసనలు కొనసాగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ