ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలి

ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫికేషన్లు విడుదల చేసిన గ్రూప్‌-4, ఎండోమెంట్‌ ఉద్యోగాలకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిక్‌ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌ గాంధీనగర్‌

Published : 22 May 2022 05:49 IST

ఏపీ ఉద్యోగ పోరాట సమితి డిమాండ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫికేషన్లు విడుదల చేసిన గ్రూప్‌-4, ఎండోమెంట్‌ ఉద్యోగాలకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిక్‌ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌ గాంధీనగర్‌ డివిజన్‌లోని కెనరా బ్యాంకు ఎదురుగా ఉన్న పార్కులో ఏపీ నిరుద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్లు విడుదల చేసి నెలలు గడుస్తున్నా పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఏపీ భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ నాయుడు మాట్లాడుతూ డీఎస్సీ, ట్రాన్స్‌కో, డిస్కం, ఇతర శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని