మళ్లీ సీసీ కెమెరాల టెండర్లు రద్దు
ప్రభుత్వాసుపత్రులకు సీసీ కెమెరాల కొనుగోళ్ల వ్యవహారంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నాయి. రాష్ట్రంలోని 1,856 ఆసుపత్రుల్లో రూ.14 కోట్ల వ్యయంతో 8,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎప్పటికి బిగిస్తారో?
ఈనాడు, అమరావతి: ప్రభుత్వాసుపత్రులకు సీసీ కెమెరాల కొనుగోళ్ల వ్యవహారంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నాయి. రాష్ట్రంలోని 1,856 ఆసుపత్రుల్లో రూ.14 కోట్ల వ్యయంతో 8,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఏప్రిల్లో టెండరు పిలిచింది. నాలుగు సంస్థల నుంచి దరఖాస్తులు రాగా... పరిశీలనలో రెండింటిని తిరస్కరించారు. ప్రైస్ బిడ్లో మరో సంస్థ వైదొలిగింది. మిగిలిన దాన్ని ఎంపిక చేసే సమయంలో టెండరునే రద్దు చేశారు. మే నెలలో రెండోసారి టెండరును పిలవగా అయిదు సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఒకటి తిరస్కరణకు గురైంది. ప్రైస్ బిడ్కు వెళ్లినప్పుడు రివర్స్ ఆక్షన్ సమయంలో చివరి నిమిషంలో మూడు సంస్థలు వైదొలిగాడు. ఇందుకు హెచ్చరికలతో కూడిన ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. మిగిలిన దరఖాస్తును ఖరారు చేసేలా ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం ఈ టెండరును కూడా రద్దు చేసి, మళ్లీ కొత్తగా పిలవబోతున్నారు.
మహాప్రస్థానం అంబులెన్సుల టెండరుపై తర్జనభర్జన
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతి చెందిన వారి భౌతికకాయాలను ఇళ్లకు తరలించేందుకు ఉపయోగిస్తున్న అంబులెన్సులను నిర్వహిస్తున్న సంస్థను కొనసాగించడంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మహాప్రస్థానం కింద రాష్ట్రంలో ప్రస్తుతం 53 అంబులెన్సులు నడుస్తున్నాయి. వీటి నిర్వహణకు టెండరు ద్వారా ఖరారు చేసిన ప్రైవేట్ సంస్థ కాలపరిమితి ఈ ఏడాది మేతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయా ఆస్పత్రుల నుంచి అందిన సమాచారం మేరకు ప్రస్తుత సంస్థనే కొనసాగించాలని అభిప్రాయపడుతూ మంత్రి విడదల రజినీకి దస్త్రం పంపారు. అయితే మంత్రి మాత్రం కొత్త టెండరును పిలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ