Gold: స్కూటీ తెరిస్తే.. 8 కేజీల బంగారం
ఒక్కరోజే దాదాపు 19 కేజీల బంగారం అక్రమ రవాణాను మణిపుర్ అధికారులు అడ్డుకున్నారు. సోమవారం విమానాశ్రయంలో కొన్ని బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకోగా.. స్కూటీలో మరికొన్నింటిని గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.10 కోట్లు
ఒక్కరోజే దాదాపు 19 కేజీల బంగారం అక్రమ రవాణాను మణిపుర్ అధికారులు అడ్డుకున్నారు. సోమవారం విమానాశ్రయంలో కొన్ని బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకోగా.. స్కూటీలో మరికొన్నింటిని గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని తెలిపారు. చన్డేల్ జిల్లా తమ్నాపోప్కీలో సోమవారం మధ్యాహ్నం ఓ స్కూటీ ద్వారా బంగారం అక్రమ రవాణా జరుగుతుండగా అధికారులు అడ్డుకున్నారు. బిస్కెట్ల రూపంలో తరలిస్తున్న ఈ బంగారం 8.3 కేజీలు ఉందని, దీని విలువ రూ.4.44 కోట్లు అని ఇంఫాల్ కస్టమ్స్ యాంటీ స్మగ్లింగ్ యూనిట్ అధికారులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు మోరేహ్ నుంచి వచ్చే ఎరుపు రంగు స్కూటీలో తనిఖీలు చేపట్టగా 50 బంగారం బిస్కెట్లు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. స్కూటీలోని ఎయిర్ఫిల్టర్లలో వీటిని దాచి నిందితులు స్మగ్లింగ్కు యత్నించారని తెలిపారు. అంతకుముందు.. బిస్కెట్ల రూపంలో దాదాపు 11 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ఇంఫాల్ కస్టమ్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. నిందితుడు ఎయిర్ ఏసియా విమానంలో ఇంఫాల్ నుంచి దిల్లీ వెళ్లే క్రమంలో విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించి గుట్టు రట్టు చేశారు. నిందితుడి వద్ద మొత్తం 10.79 కేజీల బరువున్న 65 బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటి విలువ రూ.5.76 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ పసిడి విదేశీ మూలాలకు చెందిందని పేర్కొన్నారు. లగేజీ బ్యాగులో ఓ దుప్పటి మధ్యలో పాస్టిక్ కవర్లో బంగారాన్ని నిందితుడు దాచినట్లు వివరించారు.
- ఈటీవీ భారత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!