Bumper offer: ఉద్యోగులకు స్టార్టప్ కంపెనీ బంపర్ ఆఫర్!
మధ్యాహ్న భోజనం తర్వాత ఓ చిన్నకునుకు తీస్తే ఆ సుఖమే వేరు. విదేశాల్లో కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఆ సంస్కృతి మన దేశంలోనూ మొదలైంది. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ తమ ఉద్యోగులు
మధ్యాహ్న భోజనం తర్వాత ఓ చిన్నకునుకు తీస్తే ఆ సుఖమే వేరు. విదేశాల్లో కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఆ సంస్కృతి మన దేశంలోనూ మొదలైంది. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ తమ ఉద్యోగులు మధ్యాహ్నం ఓ అరగంట నిద్ర పోయేందుకు అధికారికంగా అవకాశం కల్పిస్తోంది. పని మధ్యలో ఇలా కాసేపు కునుకుతీయటం వల్ల పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి, మానసిక ఆందోళన దూరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పరుపులు, సోఫాల తయారీరంగంలో ఉన్న ‘వేక్ఫిట్’ సంస్థ బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఇటీవలే తమ కార్యాలయాన్ని తెరిచింది. అలసిన ఉద్యోగులను ఉత్తేజితం చేసేందుకు ప్రతిరోజూ మధ్యాహ్నం అరగంట సమయం నిద్రలోకి జారుకునేలా ‘న్యాప్ టైం అవర్’ను ఈ సంస్థ ప్రారంభించింది. ఈ మేరకు ‘వేక్ఫిట్’ సహ వ్యవస్థాపకులు చైతన్య రామలింగ గౌడ ఇటీవలే తమ సంస్థ ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపారు. వేక్ఫిట్.. ఆన్లైను ద్వారా వినియోగదారులతో మాట్లాడి నిద్ర సమస్యలకు పరిష్కారం చూపే సంస్థ. ‘నిద్రకు సంబంధించిన వ్యాపారంలో ఆరేళ్లుగా కొనసాగుతున్నాం. నాసా పరిశోధన ప్రకారం 26 నిమిషాలపాటు ఓ కునుకు తీస్తే 33 శాతం పనితీరు మెరుగుపడుతుంది. హార్వర్డ్ అధ్యయనమూ ఇదే చెబుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకొని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మధ్యాహ్నం 2.00 - 2.30 గంటల మధ్య అధికారిక ‘న్యాప్ టైం’ ఇవ్వాలని నిర్ణయించాం. ఇందుకోసం ఆఫీసులో న్యాప్ పాడ్స్, ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేయనున్నామని చైతన్య రామలింగ గౌడ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం