మరుగుజ్జు పెళ్లి కోసం పోలీసులకు మళ్లీ ఫిర్యాదు

పిల్ల దొరికినా పెళ్లి చేయటం లేదంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం శామ్లీకి చెందిన మరుగుజ్జు యువకుడు అజీం మన్సూరీ (26) తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది క్రితం ఇదే ఫిర్యాదుతో అజీం వార్తల్లో నిలవగా..

Published : 15 May 2022 11:11 IST

పిల్ల దొరికినా పెళ్లి చేయటం లేదంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం శామ్లీకి చెందిన మరుగుజ్జు యువకుడు అజీం మన్సూరీ (26) తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది క్రితం ఇదే ఫిర్యాదుతో అజీం వార్తల్లో నిలవగా.. గాజియాబాద్‌కు చెందిన రెహానా అనే మరుగుజ్జు యువతి ముందుకొచ్చింది. అయినా ఇంట్లోవాళ్లు పెళ్లి చేయకపోవటంతో సహనం చచ్చిన అజీం మళ్లీ పోలీస్‌స్టేషను మెట్లు ఎక్కాడు. మూడడుగుల పొడవు ఉన్న అజీం.. పెళ్లి విషయంలో సాయం చేయాలంటూ శామ్లీ స్టేషన్‌ ఇంఛార్జికి మొరపెట్టుకున్నాడు. ఆ యువతితో 2021 లోనే తనకు వివాహం నిశ్చయమైనా.. తల్లిదండ్రులు జాప్యం చేస్తున్నారని తెలిపాడు. అజీం ఫిర్యాదు అందుకొన్న పోలీసులు మరోసారి అతడి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని