ఫైవ్‌స్టార్‌ హోటల్లో సాధువుల భేటీ!

సాధువులూ ట్రెండు మార్చారు. గతంలో మాదిరి మఠాలు, పుణ్యక్షేత్రాలు కాకుండా ఇప్పుడు ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హరిద్వార్‌లో అఖిల భారత అఖాడా పరిషత్‌ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు...

Updated : 15 May 2022 07:38 IST

వైరల్‌ అవుతున్న చిత్రాలు

సాధువులూ ట్రెండు మార్చారు. గతంలో మాదిరి మఠాలు, పుణ్యక్షేత్రాలు కాకుండా ఇప్పుడు ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హరిద్వార్‌లో అఖిల భారత అఖాడా పరిషత్‌ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రజలు ఆధునిక జీవనానికి అలవాటుపడుతున్న మాట సాధారణమే అయినా.. అటువంటి ఆడంబరాలకు దూరంగా ఉండే సాధువులు కూడా ఆ జాబితాలో చేరడం విశేషం. చార్‌ధామ్‌ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఏం చర్చించారనేది పక్కనపెడితే.. సంబంధిత ఫొటోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సాధువులు కూడా సోషల్‌ మీడియాను ఇపుడు చక్కగా వినియోగించుకొంటున్నారు. దాదాపు అన్ని మఠాలవారు ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో చురుగ్గా ఉంటూ.. భక్తులకు దగ్గరవుతున్నారు. తమకు సంబంధించిన విషయాలను ఫొటోలు, వీడియో సందేశాల ద్వారా ఆయా గ్రూపుల్లో షేర్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని