సీసీఐని అమ్మి ఏం సాధిస్తారు?
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాన్ని విక్రయించి భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏం సాధిస్తుందని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. లక్షల మందికి జీవనాధారమైన సింగరేణి,
కేంద్రంపై ఎమ్మెల్సీ కవిత ధ్వజం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాన్ని విక్రయించి భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏం సాధిస్తుందని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. లక్షల మందికి జీవనాధారమైన సింగరేణి, ఆదిలాబాద్కు జీవనాడిగా ఉన్న సీసీఐ (సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ని ప్రోత్సహించాల్సింది పోయి ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేయడం దారుణమని పేర్కొన్నారు. బుధవారం ఆమె తమ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ‘‘తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాన్ని విక్రయించగా వచ్చే డబ్బును ఈ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర భాజపా నాయకులకు ఉందా?’’ అని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న భాజపాను అడుగడుగునా నిలదీయాలని ఆమె సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?