తమిళనాడు మాజీ మంత్రి వేలుమణికి నివేదిక ప్రతిని అందజేయండి
అవినీతి కేసులో తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఎస్పీ వేలుమణిపై చేపట్టిన ప్రాథమిక విచారణ నివేదిక ప్రతిని ఆయనకు అందజేయాల్సిందిగా... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం మద్రాసు హైకోర్టును ఆదేశించింది
అవినీతి కేసులో మద్రాస్ హైకోర్టుకు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం ఆదేశాలు
దిల్లీ: అవినీతి కేసులో తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఎస్పీ వేలుమణిపై చేపట్టిన ప్రాథమిక విచారణ నివేదిక ప్రతిని ఆయనకు అందజేయాల్సిందిగా... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం మద్రాసు హైకోర్టును ఆదేశించింది. ఈ వ్యవహారంలో తార్కిక ముగింపునకు రాకుండా మద్రాసు హైకోర్టు తప్పిదానికి పాల్పడినట్టు భావిస్తున్నామని పేర్కొంది. తన ముందున్న సామగ్రిని హైకోర్టు పరిశీలించకుండా... కేవలం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పిన విషయాలపైన ఆధారపడి, అప్పీలుదారు పట్ల పక్షపాతం కలిగించే విస్తృత పరిశీలనలు జరిపిందని ఆక్షేపించింది.
టెండర్ల ప్రక్రియను ఖరారుచేసే విషయంలో మంత్రిగా ఉన్నప్పుడు వేలుమణి తన అధికారాలను దుర్వినియోగం చేశారని, మున్సిపల్ కార్పొరేషన్లలో తన సన్నిహితులకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపిస్తూ... ఆర్.ఎస్.భారతి 2018, సెప్టెంబరు 11న మద్రాసు హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయమై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాలకూ ఫిర్యాదు చేశారు. వీటిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో... మాజీ మంత్రిపై కేసు నమోదుచేసి, సిట్తో దర్యాప్తు చేయించాలంటూ భారతి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో హైకోర్టు తీరును సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది.
అప్పీలుదారుకు అవకాశం ఇవ్వలేదు...
‘‘పిటిషన్లోని అంశాలపై ప్రాథమిక విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. తర్వాత నివేదికలోని అంశాలను హైకోర్టు పరిశీలించాల్సింది పోయి... తాను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో పెట్టింది. ఈ విషయంలో హైకోర్టు అనుసరించిన విధానాన్ని చట్టబద్ధంగా అంగీకరించలేం. రాష్ట్రంలో అధికార మార్పు జరిగిన తర్వాత... ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. దీన్ని హేతుబద్ధంగా ఎలా సమర్థించుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైకోర్టు వివరణ కోరలేదు! సరికదా, తనను తాను రక్షించుకునే అవకాశమైనా అప్పీలుదారుకు ఇవ్వలేదు. మాజీ మంత్రిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తొందరపడింది. అప్పీలుదారుపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేమంటూ మొదటి అఫిడవిట్లో పేర్కొన్న ప్రభుత్వం... ఆ తర్వాత భిన్న వైఖరిని తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ప్రాథమిక విచారణ నివేదికను కనీసం మాజీ మంత్రికి అందించలేదు. ఎస్పీ ఆర్.పొన్ని నివేదిక, ఇతర పత్రాలను అప్పీలుదారుకు అందజేయాలని ఆదేశిస్తున్నాం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం