తండ్రి స్థానానికే కళంకం!

బిహార్‌లో మైనర్లయిన తన ఇద్దరు కుమార్తెలపైనే ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులందించిన వివరాల ప్రకారం.. బాధిత బాలికలు బక్సర్‌ జిల్లా రాజ్‌పుర్‌ తాలుకాలో ఉంటున్నారు. వీరి తండ్రి నకిలీ వైద్యుడు.

Published : 22 May 2022 06:06 IST

బిహార్‌లో కుమార్తెలపై తండ్రి అత్యాచారం

బిహార్‌లో మైనర్లయిన తన ఇద్దరు కుమార్తెలపైనే ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులందించిన వివరాల ప్రకారం.. బాధిత బాలికలు బక్సర్‌ జిల్లా రాజ్‌పుర్‌ తాలుకాలో ఉంటున్నారు. వీరి తండ్రి నకిలీ వైద్యుడు. విటమిన్‌ మాత్రల పేరుతో బాలికలకు నిద్రమాత్రలు ఇచ్చేవాడు. అనంతరం తన స్నేహితుడైన ఓ తాంత్రికుడితో తన క్లినిక్‌లోనే అత్యాచారం చేయించేవాడు. అనంతరం తాను కూడా అఘాయిత్యానికి ఒడిగడుతుండేవాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత తండ్రిని ఎదిరిస్తే తీవ్రంగా కొట్టేవాడు. దీంతో అతడి హింసను తట్టుకోలేక ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. బక్సర్‌లో చిన్న అద్దె ఇంట్లో ఉంటూ విషయమంతా గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. బాధిత బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు బక్సర్‌ ఎస్పీ తెలిపారు. కొడుకు పుట్టాలన్న ఆశతోనే బాలికల తండ్రి తాంత్రికుడితో కలిసి దారుణానికి ఒడిగట్టినట్లు ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని