అతివేగం.. మృత్యుపాశం
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమవుతోంది. కేంద్ర రవాణా, రహదారుల శాఖ(మోర్త్) గత బుధవారం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది.
రోడ్డు ప్రమాద మరణాలకిదే ముఖ్యకారణం
మోర్త్-2020 వార్షిక నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమవుతోంది. కేంద్ర రవాణా, రహదారుల శాఖ(మోర్త్) గత బుధవారం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది. 2020 సంవత్సరానికి సంబంధించిన జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఈ నివేదిక ప్రకారం మొత్తం 19,172 ప్రమాదాల్లో 6,882 మంది మృతిచెందగా.. 18,661 మంది క్షతగాత్రులయ్యారు.ఆ నివేదికలోని మరికొన్ని వివరాలు...
శిరస్త్రాణం లేకపోవడంతో..
ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన వారిలో 41.33 శాతం మంది శిరస్త్రాణం ధరించకపోవడం వల్లే మరణించారు.
* ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్లు : 2004
* మృతిచెందిన పిలియన్ రైడర్లు(వెనక కూర్చున్నవారు) : 841
* క్షతగాత్రులైన డ్రైవర్లు : 3837
* గాయపడ్డ పిలియన్ రైడర్లు : 2489
మృత్యుమాసం.. డిసెంబరు
ఏడాది మొదటి రెండు.. చివరి రెండు నెలల్లో ఎక్కువ ప్రమాదాలు సంభవించాయి. డిసెంబరులో అత్యధిక ప్రమాదాలు, మరణాలు సంభవించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?