Hand Writing: ఒకేలా 305 మంది విద్యార్థుల చేతిరాత..
ఏకంగా 305 మంది విద్యార్థులు ఒకే విధమైన చేతిరాతతో ప్రపంచ రికార్డు సృష్టించారు. బాడ్మేర్ (రాజస్థాన్)లోని కలాం ఆశ్రమానికి చెందిన విద్యార్థులు ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్రను ఆంగ్లంలో రాసి ఈ అరుదైన ఘనతను సాధించారు.
ఏకంగా 305 మంది విద్యార్థులు ఒకే విధమైన చేతిరాతతో ప్రపంచ రికార్డు సృష్టించారు. బాడ్మేర్ (రాజస్థాన్)లోని కలాం ఆశ్రమానికి చెందిన విద్యార్థులు ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్రను ఆంగ్లంలో రాసి ఈ అరుదైన ఘనతను సాధించారు. సాధారణంగా చేతిరాత ఒక్కొక్కరిదీ ఒక్కోవిధంగా ఉంటుంది. కొద్ది మంది చేతిరాత మాత్రం ఒకేలా కనిపిస్తుంది. అయితే 300 మందికి పైగా విద్యార్థులు ఒకే విధమైన చేతిరాతతో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈమేరకు ‘వరల్డ్స్ గ్రేటెస్ట్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించారు. శుక్రవారం నిర్వహించిన విద్య, ప్రేరణ శిబిరంలో ఈ అద్భుతం చేశారు. వారికి చేతిరాత నిపుణులు ఓంప్రకాశ్ సివాచ్ కొద్ది రోజులుగా శిక్షణ ఇచ్చారు. ‘‘నేను మొదటిసారి ఈ శిబిరంలో పాల్గొన్నాను. చేతిరాతలో శిక్షణ తీసుకున్నాను. అంతకు ముందు నా చేతిరాత సరిగా ఉండేది కాదు. ఇప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించడం సంతోషంగా ఉంది’’ అని మాయ అనే విద్యార్థిని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!