Cheetah: మనుషుల్ని చంపి.. మామిడి చెట్టెక్కి నిద్రిస్తున్న చిరుత
ఓ చిరుత నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ.. మామిడి చెట్టుపై నిద్రిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అటవీ, అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి సమాచారం అందించగా.. వారు వచ్చి చిరుతను బంధించారు. ఈ ఘటన
ఓ చిరుత నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ.. మామిడి చెట్టుపై నిద్రిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అటవీ, అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి సమాచారం అందించగా.. వారు వచ్చి చిరుతను బంధించారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని అలీపుర్ద్వార్ జిల్లా షిల్బరీహట్ ఘాట్పడ్ ప్రాంతంలో జరిగింది. కొద్దిరోజులుగా చిరుత ప్రజల్ని వేటాడుతోందని గ్రామస్థులు తెలిపారు. చిరుత దాడిలో కొందరు మరణించగా, మరికొందరు గాయపడ్డారని వెల్లడించారు. మంగళవారం.. రబియుల్ మియాన్ అనే వ్యక్తి ఇంటిపక్కన మామిడి చెట్టుపై చిరుత నిద్రిస్తుండడాన్ని చూసిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దానికి మత్తు కలిగించేందుకు రెండు ట్రాంక్వలైజర్ షాట్స్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. చిరుతను మళ్లీ అడవిలో వదిలిపెడతామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా