Vijayawada: ఆప్యాయత కరవై.. అనంత లోకాలకు!
ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమెకు భర్త నుంచి కోరుకున్న ఆప్యాయత దొరకలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా అతడిలో మార్పు రాలేదు. దీన్ని భరించలేక ఆమె గతంలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తృటిలో
పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్న వివాహిత
కృష్ణలంక, న్యూస్టుడే: ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమెకు భర్త నుంచి కోరుకున్న ఆప్యాయత దొరకలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా అతడిలో మార్పు రాలేదు. దీన్ని భరించలేక ఆమె గతంలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. తీవ్ర మనస్తాపంతో జీవిస్తున్న ఆ మహిళ ఇక తట్టుకోలేక పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లారీడ్రైవర్గా పనిచేసే చలమలశెట్టి గోపాలకృష్ణకు పాయకాపురానికి చెందిన చందన లక్ష్మి(27)తో 2012లో వివాహమైంది. వారికి నాగమణికంఠ (9), జయహర్ష (7) పిల్లలు. ఈ కుటుంబం కృష్ణలంక గీతానగర్ కరకట్ట సమీపంలో నివసిస్తోంది. లారీ డ్రైవర్గా పనిచేసే గోపాలకృష్ణ నిరంతరం విధుల్లో ఉండడం, మద్యం తాగడం తప్ప భార్యాపిల్లలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అతడి ప్రవర్తనతో విసుగు చెందిన చందన లక్ష్మి నాలుగేళ్ల కిందట ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆసుపత్రిలో చేర్చగా ప్రాణాపాయం తప్పింది. భర్త ప్రవర్తనలో మార్పు లేకపోవడంతోపాటు బంధువులనుంచి ఓదార్పు లభించకపోవడంతో ఆమె ఒంటరితనానికి లోనై మనస్తాపం చెందింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం పిల్లలతో పుట్టింటికి వెళ్లిన చందన లక్ష్మి మధ్యాహ్నం రెండింటికి ఇంటికి తిరిగొచ్చింది. వెంట తెచ్చుకున్న ద్రాక్షరసంలో మొక్కలకు వాడే గుళికల మందు కలిపి ముందు తాను తాగి పిల్లలతో తాగించింది. రాత్రి పదిన్నరకు ఇంటికి చేరుకున్న భర్త తలుపుకొట్టగా ఎంతసేపటికీ తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో పగులగొట్టి లోపలకు వెళ్లాడు. మంచంపై భార్యాపిల్లలు నోట్లోంచి నురుగ కారుతున్న స్థితిలో కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చి పరిశీలించి ముగ్గురూ చనిపోయినట్లు నిర్ధారించారు. చందన లక్ష్మి రాసిన లేఖ, గుళికల మందు ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురివి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ ఎంవీ దుర్గారావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ