Dog Birthday: శునకం పుట్టినరోజు వేడుక: 100 కేజీల కేక్.. 5 వేల మందికి భోజనాలు
కర్ణాటకలో ఓ పెంపుడు శునకానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఓ యజమాని. ఏకంగా 100 కేజీల కేక్ను కట్ చేశారు. అలాగే 5 వేల మందికి భోజనాలు పెట్టారు. ఇంత ఘనంగా వేడుకలు చేయడం వెనుక ఓ పెద్ద పొలిటికల్...
కర్ణాటకలో ఓ పెంపుడు శునకానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఓ యజమాని. ఏకంగా 100 కేజీల కేక్ను కట్ చేశారు. అలాగే 5 వేల మందికి భోజనాలు పెట్టారు. ఇంత ఘనంగా వేడుకలు చేయడం వెనుక ఓ పెద్ద పొలిటికల్ కథ ఉందట. అదేంటో తెలుసుకుందామా? బెళగావి జిల్లా తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప మర్డి తన పెంపుడు శునకం క్రిష్ను ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటాడు. ఇటీవల క్రిష్ పుట్టిన రోజు వేడుకలకు గ్రామంలోని 5 వేల మందిని పిలిచాడు. 100 కిలోల కేక్ను కట్ చేశాడు. 300 కేజీల మాంసం, 100 కేజీల గుడ్లను అతిథులకు వండిపెట్టారు. శాకాహారులకు 50 కేజీల కూరగాయల భోజనాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం పెంపుడు కుక్క క్రిష్ను ఘనంగా ఊరేగించారు. శివప్ప మర్డి గత 20 ఏళ్లుగా గ్రామ పంచాయతీ సభ్యుడు. ఓ సారి కొత్త పంచాయతీ సభ్యుడు తన పుట్టిన రోజు వేడుకల్లో పాత పంచాయతీ సభ్యులపై అవమానకర వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రభుత్వ హయాంలో పాత పంచాయతీ సభ్యులు కుక్కల్లా తిన్నారని కించపరిచాడు. ఈ సభ్యుడి వ్యాఖ్యలకు నిరసనగా శివప్ప తన పెంపుడు కుక్కకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట