మహిళ చేతులు కట్టేసి నాలుగో అంతస్తు నుంచి తోసివేత

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. గాజియాబాద్‌కు చెందిన రితిక (35)కు ఫిరోజాబాద్‌కు చెందిన అమిత్‌గౌతమ్‌తో 2014లో వివాహమైంది. విభేదాల కారణంగా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె.. ఏడాదిన్నర నుంచి

Published : 25 Jun 2022 05:51 IST

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. గాజియాబాద్‌కు చెందిన రితిక (35)కు ఫిరోజాబాద్‌కు చెందిన అమిత్‌గౌతమ్‌తో 2014లో వివాహమైంది. విభేదాల కారణంగా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె.. ఏడాదిన్నర నుంచి ఆగ్రాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో తన ప్రేమికుడితో సహజీవనం చేస్తోంది. చాలా కాలంగా రితిక కోసం అన్వేషిస్తున్న భర్త ..ఆగ్రాలో ప్రేమికుడితో కలిసి ఉంటోందని తెలుసుకుని వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో రితిక చేతులను కట్టేసి అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి వేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని