5 హెక్టార్ల భారత భూభాగాన్ని నేపాల్‌ ఆక్రమించింది

కాలాపానీ వివాదం నేపథ్యంలో భారత్‌-నేపాల్‌ మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వివాదం సద్దుమణిగి.. ఇరు దేశాలు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. మరో దిగ్భ్రాంతికర విషయం తెరపైకి వచ్చింది. నేపాల్‌ నుంచి భారత్‌ స్నేహాన్ని కోరుకుంటుంటే..

Published : 26 Jun 2022 05:39 IST

ఉత్తరాఖండ్‌ అటవీశాఖ

కాలాపానీ వివాదం నేపథ్యంలో భారత్‌-నేపాల్‌ మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వివాదం సద్దుమణిగి.. ఇరు దేశాలు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. మరో దిగ్భ్రాంతికర విషయం తెరపైకి వచ్చింది. నేపాల్‌ నుంచి భారత్‌ స్నేహాన్ని కోరుకుంటుంటే.. ఆ దేశం మాత్రం ఉత్తరాఖండ్‌ సరిహద్దులోని ఇండియా భూభాగంపై కన్నేసినట్లు ఆ రాష్ట్ర అటవీశాఖ చెబుతోంది. గత 12 సంవత్సరాలుగా ఉత్తరాఖండ్‌ సరిహద్దులోని భారతదేశ భూమిని నేపాల్‌ ఆక్రమిస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. చంపావత్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఇప్పటివరకు అటవీ శాఖకు చెందిన 5 హెక్టార్ల భారత భూమిని నేపాల్‌ ఆక్రమించినట్లు అందులో వెల్లడించింది. వాస్తవానికి ఈ విషయమై భారత ప్రభుత్వానికి సరిహద్దులో మోహరించిన సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) నివేదించింది. తాజాగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి.. ఆ రాష్ట్ర అటవీ శాఖ నివేదిక అందజేసింది. మరోవైపు, ఈ విషయమై ఉత్తరాఖండ్‌ అటవీ శాఖ మంత్రి సుబోధ్‌ ఉనియాల్‌ స్పందించారు. ‘‘ఆక్రమణ 2010 నాటిది. ఎస్‌ఎస్‌బీ కూడా భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. చంపావత్‌లోని పూర్ణగిరికి వచ్చిన భక్తులు.. నేపాల్‌లోని భైరవుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఎంతో ప్రాశస్త్యం ఉన్న పూర్ణగిరి కోసమే.. నేపాల్‌ ఆక్రమణలకు పాల్పడి ఉండొచ్చు. ఈ సమస్యపై భారత ప్రభుత్వం నేపాల్‌ ప్రభుత్వంతో మాట్లాడుతోంది’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని