దార్జీలింగ్ కొండల్లో కొత్త పార్టీ ప్రభంజనం
దార్జీలింగ్ కొండల్లోని గూర్ఖాలాండ్ ప్రాదేశిక పాలనా సంస్థ (జీటీఏ)కి ఆదివారం జరిగిన ఎన్నికల్లో కేవలం తొమ్మిది నెలల క్రితం ఆవిర్భవించిన భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా (బీజీపీఎం) అతి
కోల్కతా: దార్జీలింగ్ కొండల్లోని గూర్ఖాలాండ్ ప్రాదేశిక పాలనా సంస్థ (జీటీఏ)కి ఆదివారం జరిగిన ఎన్నికల్లో కేవలం తొమ్మిది నెలల క్రితం ఆవిర్భవించిన భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా (బీజీపీఎం) అతి పెద్ద పార్టీగా నిలిచింది. పాక్షిక స్వయంనిర్ణయాధికారం కలిగిన జీటీఏలోని 45 సీట్లకు మోర్చా 27 సీట్లను కైవసం చేసుకుంది. మరో కొత్త పార్టీ హమ్రో ఎనిమిది, తృణమూల్ కాంగ్రెస్ అయిదు స్థానాలను దక్కించుకున్నాయి. జీటీఏలో తృణమూల్ సీట్లు నెగ్గడం ఇదే తొలిసారి. బీజీపీఎం మద్దతు గల స్వతంత్రులు అయిదు సీట్లు సాధించారు. గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం)లో సభ్యుడిగా ఉన్న అనిత్ ధాపా గత సెప్టెంబరులో బయటకు వచ్చి బీజీపీఎం పార్టీని స్థాపించారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను వదలి తమ ప్రాంత అభివృద్ధి అవసరాలపై దృష్టిపెడుతున్నారు. 2011లో ఏర్పాటైన గూర్ఖాలాండ్ ప్రాదేశిక పాలనా సంస్థ (జీటీఏ)కి 2012లో ఎన్నికలు జరిగాయి. తాజా ఎన్నికలను జీజేఎం, భారతీయ జనతాపార్టీ, గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్లు బహిష్కరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?