Dream11: డ్రీమ్ 11లో జాక్పాట్
ఫాంటసీ క్రికెట్ గేమ్లో ఉత్తర్ప్రదేశ్ వాసి జాక్పాట్ కొట్టాడు. డ్రీమ్-11 యాప్లో ఏకంగా రూ.కోటి గెలుచుకున్నాడు. పీలీభీత్లోని హరిపుర్ కిషన్పుర్ గ్రామానికి చెందిన హషీమ్.. నాలుగేళ్లుగా డ్రీమ్-11లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా
రూ.కోటి గెలుచుకున్న యువకుడు
ఫాంటసీ క్రికెట్ గేమ్లో ఉత్తర్ప్రదేశ్ వాసి జాక్పాట్ కొట్టాడు. డ్రీమ్-11 యాప్లో ఏకంగా రూ.కోటి గెలుచుకున్నాడు. పీలీభీత్లోని హరిపుర్ కిషన్పుర్ గ్రామానికి చెందిన హషీమ్.. నాలుగేళ్లుగా డ్రీమ్-11లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా ఇండియా వర్సెస్ ఐర్లండ్ మ్యాచ్లో రూ.49 పెట్టి ఫాంటసీ గేమ్ ఆడాడు. మ్యాచ్లో ఉత్తమంగా ఆడిన ప్లేయర్లతోనే టీమ్ను ఎంపిక చేసుకున్న అతడు.. ఫాంటసీ గేమ్లో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో రూ.కోటి గెలుచుకున్నాడు. ప్రస్తుతం అతడి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. అయితే, హషీమ్ కుటుంబ సభ్యులు దీనిపై ఏమీ మాట్లాడడం లేదు. హషీమ్, అతడి సోదరుడు కలిసి కారు కొనేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.