తల్లి, సోదరిని హత్య చేసి.. డ్రైవర్‌తో కలసి యువతి ఆత్మహత్య

మహారాష్ట్ర ముంబయిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌తో కలిసి కన్నతల్లిని, అక్కను హత్య చేసింది ఓ యువతి. ఆ తర్వాత డ్రైవర్‌తో పాటే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది

Published : 01 Jul 2022 06:34 IST

ముంబయి: మహారాష్ట్ర ముంబయిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌తో కలిసి కన్నతల్లిని, అక్కను హత్య చేసింది ఓ యువతి. ఆ తర్వాత డ్రైవర్‌తో పాటే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు తల్లి, పెద్దకుమార్తె మృతదేహాలు భవనం రెండో అంతస్తులో రక్తపుమడుగులో కన్పించాయి. చిన్నకుమార్తె, డ్రైవర్‌ల మృతదేహాలు మొదటి అంతస్తులో ఉరికి వేలాడుతూ ఉన్నాయి. తల్లీకూతుళ్లను చంపి తామూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డ్రైవర్‌ వద్ద లభించిన లేఖల్లో ఉందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని