జీవనశైలి మార్పులతో వ్యాధులు..
జీవనశైలి మార్పులతో వస్తున్న వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘ది ఎకనామిక్ టైమ్స్’ ఆధ్వర్యంలో దిల్లీలో గురువారం నిర్వహించిన ‘డాక్టర్స్ డే
అప్రమత్తంగా ఉండాలన్న గవర్నర్ తమిళిసై
ఈనాడు- దిల్లీ, హైదరాబాద్: జీవనశైలి మార్పులతో వస్తున్న వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘ది ఎకనామిక్ టైమ్స్’ ఆధ్వర్యంలో దిల్లీలో గురువారం నిర్వహించిన ‘డాక్టర్స్ డే కాంక్లేవ్’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో సాంక్రమిక వ్యాధుల కన్నా అసాంక్రమిక వ్యాధులు ఎక్కువవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని తెలిపారు. నగరాల్లో జీవనశైలిలో మార్పులతోనే డయాబెటిస్, హైపర్టెన్షన్ ఇతర వ్యాధులు వస్తున్నాయన్నారు. ధనిక కుటుంబాల్లోని పిల్లలు సైతం పోషకాహార లోపాలు ఎదుర్కొంటున్నారన్నారు. కొవిడ్ సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించిన 20 మంది శ్వాసకోస వ్యాధి నిపుణులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. హైదరాబాద్లోని శ్వాస ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ విష్ణున్రావు వీరపనేని, డాక్టర్ ఆర్.విజయ్కుమార్ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.
* వైద్యులు మానవాళికి నిస్వార్థంగా, అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆమె వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్