సరిహద్దు దాటి భారత్‌లోకి పాకిస్థాన్‌ బాలుడు..

భారత సైనికులు మానవత్వాన్ని చాటుకున్నారు. దారి తప్పి మన భూభాగంలోకి వచ్చిన పాకిస్థాన్‌కు చెందిన మూడేళ్ల బాలుడిని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు.. అతని కుటుంబానికి అప్పగించారు. పంజాబ్‌లోని

Published : 03 Jul 2022 06:39 IST

భారత సైనికులు మానవత్వాన్ని చాటుకున్నారు. దారి తప్పి మన భూభాగంలోకి వచ్చిన పాకిస్థాన్‌కు చెందిన మూడేళ్ల బాలుడిని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు.. అతని కుటుంబానికి అప్పగించారు. పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకి అనుకోకుండా పాక్‌కు చెందిన బాలుడు వచ్చేశాడు. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ సెక్టార్‌లో అంతర్జాతీయ కంచె దగ్గర ఏడుస్తున్న బాలుడిని బీఎస్‌ఎఫ్‌ దళాలు గమనించాయి. అప్పటికే ఆ బాలుడు ‘నాన్న నాన్న’ అంటూ ఏడుస్తున్నాడు. అక్కడికి చేరుకున్న బీఎస్‌ఎఫ్‌ దళాలు.. బాలుడికి తినుబండారాలు, నీళ్లు ఇచ్చారు. అనంతరం పాకిస్థాన్‌ రేంజర్స్‌కు సమాచారం అందించారు. పాక్‌ రేంజర్‌ సమక్షంలో రాత్రి 9.45 నిమిషాలకు బాలుడిని అతడి తండ్రికి అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని