వినయ్ మిశ్ర పరారీలో ఉన్న నేరస్థుడు
నగదు అక్రమ చెలామణి కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న వినయ్ మిశ్ర(36)ను పరారీలో ఉన్న నేరస్థుడిగా దిల్లీ కోర్టు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో జరిగిందని భావిస్తున్న
బొగ్గు కుంభకోణం కేసులో ప్రకటించిన కోర్టు
దిల్లీ: నగదు అక్రమ చెలామణి కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న వినయ్ మిశ్ర(36)ను పరారీలో ఉన్న నేరస్థుడిగా దిల్లీ కోర్టు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో జరిగిందని భావిస్తున్న బొగ్గు కుంభకోణంలో ఇతను నిందితుడు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీకి వినయ్ మిశ్ర అత్యంత సన్నిహితుడు. ఇదే కుంభకోణానికి సంబంధించి అభిషేక్ను, అతని భార్య రుజిరా, మరికొందరిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. న్యాయస్థానంలో విచారణకు హాజరుకాకపోవడంతో అతనిని పరారీలో ఉన్న నేరస్థుడిగా శనివారం దిల్లీ కోర్టు ప్రకటించిందని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని కునుస్తోరియా, కజోరాల్లో ఉన్న ఈస్ట్రన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ గనుల నుంచి భారీ మొత్తంలో బొగ్గు చోరీకి గురైందని 2020 నవంబరులో కేసు నమోదైంది. దీనికి సంబంధించి నగదు అక్రమ చెలామణి కేసును ఈడీ దర్యాప్తు జరుపుతోంది. వినయ్ మిశ్ర సోదరుడు వికాస్ మిశ్ర, మరో ఇద్దరిని ఈడీ గతంలో అరెస్టు చేసింది. మొత్తం రూ.1352 కోట్ల విలువైన కుంభకోణంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల తరఫున మిశ్ర సోదరులు రూ.730 కోట్లు వసూలు చేశారన్నది ఈడీ అభియోగం. టీఎంసీ యువజన విభాగ నాయకుడు కూడా అయిన వినయ్ మిశ్ర..ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. మిశ్ర సోదరుల ఆస్తులు కొన్నిటిని దర్యాప్తు సంస్థ జప్తు చేసింది. ఐల్యాండ్కు పరారైన వినయ్ మిశ్ర 2020లో ఆ దేశ పౌరసత్వాన్ని పొందినట్లు సమాచారం. అతనిని భారత్కు రప్పించేందుకు సీబీఐ ఇంటర్ పోల్ సహాయాన్ని అభ్యర్థించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి