గన్ను పట్టారా.. వెన్ను విరిగినట్లే..!
ఆయుధం పట్టిన యువతను మట్టుబెడుతున్న భద్రతా బలగాలు
ఏడాదిలోనే 64% మంది హతం
జమ్మూ-కశ్మీర్ ఉగ్రవాదంపై నివేదిక
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదానికి సంబంధించి ఆసక్తికరమైన నివేదికను అధికారులు విడుదల చేశారు. ఇందులో కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. ఉగ్రవాదం వైపు మళ్లుతున్న యువతలో అత్యధికులు తొలి ఏడాదిలోనే హతమవుతున్నారు. ఈ శాతం 64.1గా ఉందని తెలిపారు. బలమైన క్షేత్రస్థాయి నిఘా వ్యవస్థతో ఇందులో 28.1% మందిని తొలి నెలలోనే భద్రతా బలగాలు అంతమొందిస్తుండగా, 54.7 శాతాన్ని తొలి ఆరు నెలల్లో, 59.4 శాతాన్ని తొమ్మిది నెలల్లో ఏరివేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1-మే 31 మధ్య ఈ డేటా సేకరించినట్లు అధికారులు తెలిపారు.
పాక్ ఉగ్రవాదులే అత్యధికం
కశ్మీర్ లోయలో పాక్ ఉగ్రవాదుల చొరబాట్లు ఇటీవల భారీగా పెరుగుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో భద్రతా దళాల చేతిలో 90 మంది ముష్కరులు మృతి చెందితే.. అందులో 26 పాక్ జాతీయులే కావడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపించింది. నిరుడు మొత్తం 182 మంది ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్లో భద్రతాదళాలు మట్టుబెడితే అందులో 20 మంది మాత్రమే విదేశీయులు.
లష్కరే టాప్
తొలి ఐదు నెలల్లో 90 మంది ఉగ్రవాదులు చనిపోతే అందులో అత్యధికం లష్కరే తోయిబా నుంచే ఉన్నారు. ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన 52 మందిని భారత భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. తర్వాత స్థానాల్లో జైషే మొహమ్మద్ (20), హిజ్బుల్ ముజాహిదీన్ (11), అల్బద్ర్ (4) ఉన్నాయి.
పిస్టల్స్ పెరిగాయ్
సాధారణంగా ఉగ్రవాదులు ఎక్కువగా ఏకే-47 లాంటి మారణాయుధాలు వాడతారు. అయితే ప్రస్తుతం లోయలో పిస్టళ్ల వాడకం పెరిగింది. భద్రతా బలగాలు ఈ ఏడాది తొలి 5 నెలల్లో 350 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని చంపడం ఇటీవల ఎక్కువైందని.. అందుకే పిస్టళ్ల సంఖ్య పెరిగిందని అధికారులు అంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Corona: ఖర్గేకు మళ్లీ కరోనా పాజిటివ్.. నిన్న రాజ్యసభలో మాట్లాడిన ప్రతిపక్ష నేత!
-
India News
Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్
-
India News
Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
-
Sports News
CWG 2022: మేం రజతం గెలవలేదు.. స్వర్ణం కోల్పోయాం: శ్రీజేశ్
-
Politics News
Rajagopalreddy: మాజీ ఎంపీలతో కలిసి బండి సంజయ్తో రాజగోపాల్ రెడ్డి భేటీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్కి ఇంటర్నెట్ షేక్
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!