క్యాన్సర్ పరీక్షకు కృత్రిమ మేధ పరికరం
క్యాన్సర్ను సొంతంగా పరీక్షించుకునేందుకు కృత్రిమ మేధ పరికరాన్ని ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనికి ‘పివోట్’ అని పేరుపెట్టారు. ఇది క్యాన్సర్ కారక జీన్స్ని గుర్తించడానికి తోడ్పడటంతోపాటు సరైన చికిత్సద్వారా
ఈనాడు, చెన్నై: క్యాన్సర్ను సొంతంగా పరీక్షించుకునేందుకు కృత్రిమ మేధ పరికరాన్ని ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనికి ‘పివోట్’ అని పేరుపెట్టారు. ఇది క్యాన్సర్ కారక జీన్స్ని గుర్తించడానికి తోడ్పడటంతోపాటు సరైన చికిత్సద్వారా రోగులు త్వరగా కోలుకునేందుకు, దుష్ప్రభావాల్ని నివారించేందుకు మార్గం చూపుతుందని పరిశోధకులు ప్రకటించారు. ఐఐటీ మద్రాస్ కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ రఘునాథన్ రంగస్వామి, రాబర్ట్ బుచ్ సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్ సభ్యులు కార్తిక్ రామన్, పరిశోధకులు మాల్వికా సుధాకర్ కలిసి దీనిని రూపొందించారు. పివోట్ పరికరం ద్వారా క్యాన్సర్కు గురిచేసే కణాల ఉత్పరివర్తన, జీన్స్ తీరు, వాటిలో ఎన్ని రకాలనేది తెలుసుకోవచ్చని వారు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!