Crime News: పెళ్లి సందట్లో.. భారీ చోరీ
రాజస్థాన్లోని ఓ ఐదు నక్షత్రాల హోటల్లో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 2 కోట్ల విలువైన వజ్రాల నగలతో పాటు, రూ. 95 వేల
రూ. 2 కోట్ల వజ్రాభరణాలు, రూ. 95 వేల నగదు అపహరణ
జైపుర్: రాజస్థాన్లోని ఓ ఐదు నక్షత్రాల హోటల్లో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 2 కోట్ల విలువైన వజ్రాల నగలతో పాటు, రూ. 95 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. జైపుర్లో గురువారం ఈ దొంగతనం జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ముంబయికి చెందిన వ్యాపారి రాహుల్ భాటియా కుమార్తె వివాహాన్ని ఈ హోటల్లో నిర్వహిస్తుండగా.. ఆ కుటుంబం ఏడో అంతస్తులోని ఓ గదిలో బస చేసింది. వారంతా హోటల్ ప్రాంగణంలో పెళ్లి వేడుకకు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. హోటల్ సిబ్బంది సహకారంతోనే ఈ దొంగతనం జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భాటియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్