omicron: ఒమిక్రాన్.. ఓ హెచ్చరిక సంకేతం : సౌమ్య స్వామినాథన్
భారత్లో తగిన కొవిడ్ జాగ్రత్తలు పాటించడానికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఓ హెచ్చరిక సంకేతం లాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య
దిల్లీ: భారత్లో తగిన కొవిడ్ జాగ్రత్తలు పాటించడానికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఓ హెచ్చరిక సంకేతం లాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఆమె ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ కొత్త వేరియంట్ కట్టడికి పలు సూచనలు చేశారు. కట్టుదిట్టమైన కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ప్రధానంగా మాస్కులు ధరించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. మాస్కులను ‘జేబులో ఉన్న వ్యాక్సిన్లు’ లాంటివని ఆమె పేర్కొన్నారు. వైరస్ కట్టడికి ఇవి సమర్ధంగా పనిచేస్తాయని, ప్రధానంగా చూట్టూ మూసిఉన్న వాతావరణంలో ఇవి తప్పనిసరి అని సూచించారు. అలాగే వ్యాక్సినేషన్కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కొత్త వేరియంట్ కట్టడికి సశాస్త్రీయ వ్యూహాన్ని అనుసరించాలన్నారు. దీని స్వభావాన్ని గుర్తించేందుకు మరింత అధ్యయనం అవసరమని చెప్పారు.
వ్యాప్తి తీరుపై పరిశీలన : ఐసీఎంఆర్
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీరు, దీనిపై వ్యాక్సిన్ల సమర్థత వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రవేత్త సమీరన్ పాండా శనివారం తెలిపారు. ఈ కొత్త రకానికి సంబంధించి పలు ఇతర దేశాల్లో జన్యుపరమైన వైవిధ్యాలు, నిర్మాణాత్మక మార్పులు కనిపించినట్లు చెప్పారు. ఈ మార్పులు వైరస్ వ్యాప్తిని పెంచుతాయా? టీకాల పనితీరును ప్రభావితం చేస్తాయా? అన్నది పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు. కాగా దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని చెప్పారు.
కొత్త వేరియంట్ అస్పష్టం : ఫౌచీ
వాషింగ్టన్: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో అస్పష్టంగా ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ తెలిపారు. ఈమేరకు వివిధ అంశాలపై యూఎస్ శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని సహచరులతో చురుగ్గా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కొత్త రకానికి సంబంధించిన వాస్తవాలు, ఇది యాంటీబాడీలను ఏమారుస్తుందా? తదితర అంశాలపై వారితో సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘దక్షిణాఫ్రికాలో ఇది కచ్చితంగా కొత్త వేరియంట్. కొన్ని ఉత్పరివర్తనాలు ఉండటంతో.. ప్రత్యేకించి దీని వ్యాప్తి, రోగనిరోధక శక్తిని ఏమార్చడం వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని ఆనుపానులకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది’’ అని ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు. ఈ కొత్త రకం ఉనికి ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సంకేతాలేమీ లేవని.. అయితే ఎప్పుడు ఏదైనా జరగొచ్చని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన