గ్యాస్ లీకేజీ వల్లే యుద్ధనౌకలో పేలుడు!
ఐఎన్ఎస్ రణ్వీర్ యుద్ధనౌకలో ముగ్గురు సిబ్బంది మరణానికి కారణమైన పేలుడుపై భారత నౌకాదళం దృష్టి సారించింది.
ఏసీ కంపార్ట్మెంట్లో విడుదలైన వాయువు
మృతులను గుర్తించిన నౌకాదళం
ముంబయి: ఐఎన్ఎస్ రణ్వీర్ యుద్ధనౌకలో ముగ్గురు సిబ్బంది మరణానికి కారణమైన పేలుడుపై భారత నౌకాదళం దృష్టి సారించింది. నౌకలోని ఎయిర్ కండిషనింగ్ కంపార్ట్మెంట్లో ఈ విస్ఫోటం చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఫ్రియాన్ గ్యాస్ లీకేజీయే దీనికి కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ (ఎంసీపీవో) ఫస్ట్ క్లాస్ క్రిషన్ కుమార్, ఎంసీపీవో సెకండ్ క్లాస్ సురీందర్ కుమార్, ఎంసీపీవో సెకండ్ క్లాస్ ఏకే సింగ్గా గుర్తించారు. వీరి మృతికి నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరి కుమార్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు బాసటగా ఉంటామని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై ముంబయి పోలీసులు ‘ప్రమాదవశాత్తు జరిగిన మరణాల’ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు స్థానిక జె.జె.ఆసుపత్రిలో పోస్ట్మార్టమ్ నిర్వహించారు.
రణ్వీర్.. ముంబయిలోని నేవల్ డాక్యార్డ్లో లంగరేసి ఉన్నప్పుడు మంగళవారం ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం కేంద్రంగా సేవలు అందించే ఈ యుద్ధనౌక గత ఏడాది నవంబరు నుంచి తాత్కాలికంగా ముంబయిలో విధులు నిర్వర్తిస్తోంది.
మందుగుండు సామగ్రి పేలలేదు
నౌక ప్రమాదానికి మందుగుండు సామగ్రి విస్ఫోటం కారణం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. విస్ఫోటం జరిగినప్పుడు ఆ కంపార్ట్మెంట్లో సిబ్బంది లేరని పేర్కొన్నాయి. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న మెస్ కంపార్ట్మెంట్ ధ్వంసమైందని వివరించాయి. బాధితులు అందులోనే ఉన్నారని, వారు శకలాల కింద చిక్కుకుపోయారని వెల్లడించాయి. 11 మంది క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి ఎముకలు విరిగాయి. ఫ్రియాన్ గ్యాస్ పీల్చడం వల్ల కొందరు అస్వస్థులయ్యారు. 5వేల టన్నుల బరువుండే ఐఎన్ఎస్ రణ్వీర్లో 30 మంది అధికారులు 310 మంది నావికులు పనిచేస్తున్నారు. ఇది గరిష్ఠంగా 30 నాట్ల వేగాన్ని అందుకోగలదు. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ తరగతికి చెందిన ఈ యుద్ధనౌక.. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి, ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించగలదు. ఇందులో విమాన విధ్వంసక తుపాకులు, టోర్పిడోలూ ఉన్నాయి. ప్రస్తుత నౌకాదళాధిపతి అడ్మిరల్ హరికుమార్ కూడా గతంలో ఈ యుద్ధనౌకకు కెప్టెన్గా వ్యవహరించారు.
ఏమిటీ ఫ్రియాన్?
ఫ్రియాన్ అనేది క్లోరోఫ్లోరోకార్బన్ (సీఎఫ్సీ) తరగతికి చెందిన వాయువు. దీన్ని ఫ్రిజ్లు, ఏసీల్లో శీతలీకరణ సాధనంగా ఉపయోగిస్తున్నారు. స్ప్రేలు, పెయింట్ థిన్నర్లలోనూ వాడుతున్నారు. ఈ వాయువుకు రంగు, వాసన ఉండదు. దీనివల్ల వాతావరణంలోని ఓజోన్ పొరకు హాని జరుగుతుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఫ్రియాన్ వినియోగాన్ని తగ్గించేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..