అరుదైన ఘటన:చనిపోయిందన్న శిశువు..పూడ్చేముందు ఏడ్చింది!

వైద్యులు చనిపోయిందని నిర్థారించిన శిశువు.. 

Updated : 21 Jan 2022 10:55 IST

వైద్యులు చనిపోయిందని నిర్థారించిన శిశువు.. పూడ్చిపెట్టడానికి ముందు ఒక్కసారిగా కదిలి గుక్కపెట్టి ఏడ్చింది. ఒడిశాలోని కెందుఝర్‌ జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఖందికపడ గ్రామానికి చెందిన రాయ్‌మణి బుధవారం పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరగా ప్రసవమైంది. అయితే శిశువు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. చేసేదేమీ లేక.. మృత శిశువును ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం పూడ్చిపెట్టడానికి శ్మశానానికి వెళ్లారు. గుంతలో పెట్టడానికి ఒక్క నిమిషం ముందు ఏడ్చింది శిశువు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు నిర్లక్ష్యంగా బతికున్న శిశువును చనిపోయినట్లు చెప్పారంటూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. సదరు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు