Russia: వేడి పెంచిన రష్యా!..మరిన్ని యుద్ధవిన్యాసాలకు నిర్ణయం
ఉక్రెయిన్ అంశంపై అమెరికా, రష్యాల మధ్య పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక ఈ రెండు దేశాల
ఉక్రెయిన్పై అగ్రరాజ్యాల మధ్య ప్రతిష్టంభన
మాస్కో: ఉక్రెయిన్ అంశంపై అమెరికా, రష్యాల మధ్య పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక ఈ రెండు దేశాల మధ్య భద్రతపరంగా చెలరేగిన అతిపెద్ద సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు లక్ష మంది సైనికులను మోహరించిన రష్యా తదుపరి వ్యూహం పశ్చిమ దేశాలకు అంతుచిక్కడంలేదు. మరోవైపు ఈ ప్రాంతంలో మరిన్ని సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నామని ప్రకటించిన రష్యా.. వేడిని రాజేసింది. కరీబియన్ ప్రాంతంలో సైనిక మోహరింపులనూ కొట్టిపారేయలేమని పేర్కొంది. అమెరికా, దాని మిత్రపక్షాలను వ్యతిరేకించే నేతలతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చలు జరుపుతున్నారు.
ఉక్రెయిన్ను ఆక్రమించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఆ చర్యకు పూనుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఉక్రెయిన్ను నాటో కూటమిలోకి చేర్చుకోవడాన్ని పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మధ్య, తూర్పు ఐరోపా నుంచి ఈ కూటమి దళాలు వైదొలగాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చకుంటే ‘కొన్ని సైనిక-సాంకేతిక చర్యల’కు తాను ఆదేశించాల్సి వస్తుందని తాజాగా హెచ్చరించారు. ఉక్రెయిన్ సైన్యంతో నాటో విన్యాసాలు నిర్వహించడం, కూటమి యుద్ధనౌకలు తరచూ నల్ల సముద్రాన్ని సందర్శించడం, అమెరికా బాంబర్ విమానాలు క్రిమియా వద్దకు రావడాన్ని ఆయన ఖండించారు. ఉక్రెయిన్లో సైనికపరంగా పాగా వేసేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు.
తూర్పు ఉక్రెయిన్లో విద్రోహ చర్యలతో అతలాకుతలం చేసి, ఆ నేరాన్ని అక్కడి ప్రభుత్వంపై మోపేందుకు రష్యా కుట్ర పన్నుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. తద్వారా తన దురాక్రమణకు ప్రాతిపదికను సిద్ధం చేస్తోందని చెబుతోంది. ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేసింది. రష్యా, ఉక్రెయిన్ ప్రజలు ఒకటేనని పుతిన్ పదేపదే చెబుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉన్న అనేక భూభాగాలు ఒకప్పుడు రష్యాలో భాగంగా ఉండేవని పేర్కొన్నారు. సోవియట్ హయాంలో వాటిని ఉదారంగా ఉక్రెయిన్కు ధారాదత్తం చేశారని ఆరోపిస్తున్నారు.
మరోవైపు అమెరికా ఉత్పత్తి చేసిన ట్యాంకు, విమాన విధ్వంసక క్షిపణులను ఉక్రెయిన్కు సరఫరా చేయాలని ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియాలు నిర్ణయించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ దీన్ని స్వాగతించారు. సోవియట్ యూనియన్లో ఒకప్పుడు భాగంగా ఉన్న ఆ మూడు దేశాలు ఉక్రెయిన్కు బాసటగా నిలవడాన్ని ప్రశంసించారు. అయితే ఆయుధ సరఫరాను ప్రమాదకరమైన చర్యగా రష్యా ఇప్పటికే అభివర్ణించింది. వీటివల్ల ఉద్రిక్తతలు తగ్గబోవని స్పష్టంచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది. -
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
తప్పుడు మార్గంలో బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు యత్నించిన ఓ మహిళ ఏకంగా చనిపోయిన తన బంధువును బ్యాంకుకు తీసుకొచ్చింది. -
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
కెనడా (Canada) ఎయిర్పోర్టులో మాయమైన బంగారం కంటెయినర్ కేసులో ముందడుగు పడింది. ఆ కేసులో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
ఆ దేశంలోని ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయాలని (work from home) తాజాగా ఆ దేశాధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. -
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM