మూగ బాలికపై సామూహిక అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి

దివ్యాంగ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 26 Jan 2022 11:19 IST

దివ్యాంగ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి చేర్చగా అసలు విషయం బయటపడింది. బాధితురాలు ప్రస్తుతం 2 నెలల గర్భిణి. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఆ బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడింది. రక్తస్రావం కూడా అయింది. వెంటనే ఆమె సోదరి.. స్థానికంగా ఉండే మహాత్మాగాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించగా.. బాలిక గర్భవతి అని తేలింది. వారు పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికి చేరుకున్న అధికారులకు.. బధిర బాలిక చెప్పేది అర్థం కాలేదు. మూగ భాషను అర్థం చేసుకొనే నిపుణులను పిలిపించగా.. అసలు విషయం తెలిసింది. రెండు నెలల క్రితం వ్యవసాయ పనులు చేస్తుండగా తనపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను వెతికే పనిలో పడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని