Omicron: ‘డెల్టా’నూ అడ్డుకుంటున్న ఒమిక్రాన్ రోగనిరోధకత
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారినపడిన వారిలో వస్తున్న రోగనిరోధక స్పందన గణనీయంగా ఉంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి
ఐసీఎంఆర్ అధ్యయనం
దిల్లీ: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారినపడిన వారిలో వస్తున్న రోగనిరోధక స్పందన గణనీయంగా ఉంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం వెల్లడించింది. ఈ రోగనిరోధకత ఒమిక్రాన్పైనే కాకుండా.. డెల్టా సహా ఇతర ఆందోళనకర వేరియంట్లపైనా సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలిపింది. దీంతో డెల్టా రకం వల్ల మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా చేసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఒమిక్రాన్కు ప్రత్యేక టీకా వ్యూహం అవసరాన్ని అధ్యయనం నొక్కిచెప్పింది. ఐసీఎంఆర్ ఒమిక్రాన్ బారినపడిన 39 మందిపై ఈ అధ్యయనం చేపట్టింది. ఇందులో ఆరుగురు టీకా తీసుకోనివారున్నారు. వీరిలో మొత్తం 28 మంది విదేశాల నుంచి వచ్చినవారు కాగా.. 11 మంది వారికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. అయితే టీకా పొందనివారిలో తక్కువ రోగనిరోధక స్పందన కనిపించింది. ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ప్రగ్యా డి.యాదవ్, గజానన్ ఎన్.సప్కాల్, రీమా ఆర్.సహాయ్, ప్రియా అబ్రహం తదితరులు ఈ అధ్యయనం చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ