Crime News: మొక్కే కదా అని పీకేస్తే..కొట్టి చంపిన మైనర్
ఈ ఘటన గురించి వింటే ‘‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’’ అన్న సినిమా డైలాగ్ గుర్తుకు రావడం ఖాయం. అవును..
ఈ ఘటన గురించి వింటే ‘‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’’ అన్న సినిమా డైలాగ్ గుర్తుకు రావడం ఖాయం. అవును.. తన పొలంలోని మొక్కను పీకేసినందుకు 12 ఏళ్ల బాలుడు.. 7 ఏళ్ల మరో బాలుడ్ని చంపేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని బుర్హాన్పుర్ జిల్లా షేక్పుర్ గ్రామంలో జనవరి 26న జరిగింది. నిందితుడు తన వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షిస్తుండగా.. అదే గ్రామానికి చెందిన బాలుడు మొక్కను పీకుతూ కనిపించాడు. దీంతో కోపంతో స్పృహ తప్పేలా కొట్టాడు. ఆ తర్వాత కాసేపటికే మృతిచెందాడు. భయంతో బాలుడి గుండె ఆగడంతోనే మృతిచెందినట్లు శవపరీక్షలో వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని పోలీసులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?