Crime News: మొక్కే కదా అని పీకేస్తే..కొట్టి చంపిన మైనర్‌

ఈ ఘటన గురించి వింటే ‘‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’’ అన్న సినిమా డైలాగ్‌ గుర్తుకు రావడం ఖాయం. అవును.. 

Updated : 30 Jan 2022 10:34 IST

ఈ ఘటన గురించి వింటే ‘‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’’ అన్న సినిమా డైలాగ్‌ గుర్తుకు రావడం ఖాయం. అవును.. తన పొలంలోని మొక్కను పీకేసినందుకు 12 ఏళ్ల బాలుడు.. 7 ఏళ్ల మరో బాలుడ్ని చంపేశాడు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌ జిల్లా షేక్‌పుర్‌ గ్రామంలో జనవరి 26న జరిగింది. నిందితుడు తన వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షిస్తుండగా.. అదే గ్రామానికి చెందిన బాలుడు మొక్కను పీకుతూ కనిపించాడు. దీంతో కోపంతో స్పృహ తప్పేలా కొట్టాడు. ఆ తర్వాత కాసేపటికే మృతిచెందాడు. భయంతో బాలుడి గుండె ఆగడంతోనే మృతిచెందినట్లు శవపరీక్షలో వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని పోలీసులు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని