AP PRC: ఇప్పుడు సీఎంకు ఎలా ధన్యవాదాలు చెబుతావు?
పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణపై సోషల్ మీడియాలో పలువురి ధ్వజం
ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నాయకుడు సూర్యనారాయణ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పదో పీఆర్సీకి సంబంధించి గత తెదేపా హయాంలో 43శాతం ఫిట్మెంట్ ప్రకటించగా.. దానికి తెలంగాణ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పాలన్నారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో 30శాతం ఫిట్మెంట్ ఇచ్చారని.. అదే ఏపీలో 27 శాతం ఐఆర్ ఇచ్చి ఫిట్మెంట్ను 23 శాతానికి తగ్గించేశారని తెలిపారు. ఇప్పుడు సూర్యనారాయణ ముఖ్యమంత్రికి ఎలా ధన్యవాదాలు చెబుతారంటూ ధ్వజమెత్తుతున్నారు. సూర్యనారాయణ వ్యాఖ్యల వివరాలివి.
తెదేపా హయాంలో 43శాతం ఫిట్మెంట్ ప్రకటనపై..
ప్రేమతో ఇచ్చారనుకుంటున్నారా?..
‘43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. సంతోషం. ఎందుకిచ్చారు? మన ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న అవ్యాజ ప్రేమతో ఇచ్చారా? మన ఉద్యోగ సంఘాల నాయకుల పోరాట పటిమచూసి భయపడిపోయి ఇచ్చారా? అలాంటి భ్రమలు మీకు ఎవరికైనా ఉన్నాయా? అక్కడ (తెలంగాణలో) ఇచ్చారు కాబట్టి ఇక్కడా (ఆంధ్రప్రదేశ్లో) ఇవ్వాల్సి వచ్చింది. ఈ అంశంలో ధన్యవాదాలు చెప్పాల్సి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్పాలి.
మంత్రుల కమిటీతో చర్చల అనంతరం తాజా వ్యాఖ్యలు ఇలా..
ఉద్యోగుల పాలిట శుభదినం.. గుడ్ డీల్
మా అసమ్మతిని తెలియజేసిన వెంటనే మా మనసు గుర్తెరిగి సమస్యలపై చర్చించేందుకు అతి తక్కువ వ్యవధిలో మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. వారూ సహనంతో చర్చించారు. జగన్ ప్రభుత్వం ఎక్కువ ఫిట్మెంట్ ఇస్తుందన్న అంచనాలు ఉద్యోగుల్లో పెరగడం కూడా కొంత ఇబ్బందైంది. కొవిడ్, ఆర్థిక ఇబ్బందులు లేకపోయుంటే జగన్ ప్రభుత్వం ఉద్యోగుల అంచనాల్ని అందుకుని ఉండేదనే భావిస్తున్నాం. మేము మంత్రుల కమిటీ ఎదుట 13 డిమాండ్లు ఉంచితే 17అంశాల్లో మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించి మాతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది గుడ్డీల్ అనే భావిస్తున్నా. ఊహించినదానికంటే ఎక్కువే ఇవ్వాలని ఉన్నప్పటికీ కొవిడ్ పరిస్థితుల రీత్యా చేయలేకపోయామని సీఎం చెప్పారు. ఇకపై నెలకోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతామని హామీనిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: గోరంట్ల మాధవ్ ఏం తప్పు చేశారు?: అనితకు వైకాపా కార్యకర్త ఫోన్
-
Sports News
CWG 2022: నీరజ్ చోప్రా ఒలింపిక్స్ గోల్డ్..మా ఆలోచన విధానాన్నే మార్చేసింది: భారత అథ్లెట్లు
-
Latestnews News
Whatsapp: వాట్సాప్ నుంచి కొత్త అప్డేట్.. ఇక 2 రోజుల తర్వాతా డిలీట్!
-
Movies News
Nithiin: సెట్స్లో నితిన్, కృతిశెట్టి నవ్వులు.. ‘మాచర్ల..’ మేకింగ్ వీడియో చూశారా!
-
Politics News
Harish Rao: తక్షణమే 50లక్షల వ్యాక్సిన్లు పంపండి: కేంద్రానికి హరీశ్ లేఖ
-
Politics News
Bihar: భాజపాతో పొత్తు ముగిసింది.. పార్టీ నేతల సమావేశంలో నీతీశ్ నిర్ణయం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్కి ఇంటర్నెట్ షేక్
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- CWG 2022: కొవిడ్ అని తేలినా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్..ఎలా!