Pegasus: ఇజ్రాయెల్లో పెగాసస్ సెగ.. మాజీ ప్రధాని నెతన్యాహు కుమారుడి ఫోన్పై నిఘా
ప్రపంచంలోని పలు దేశాలకు పెగాసస్ స్పైవేర్ను అందించిన ఇజ్రాయెల్.. ఇప్పుడు ఆ నిఘా పరికరాలు తన సొంత
అధికారులు, వ్యాపారవేత్తలపైనా.. దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం
జెరూసలేం: ప్రపంచంలోని పలు దేశాలకు పెగాసస్ స్పైవేర్ను అందించిన ఇజ్రాయెల్.. ఇప్పుడు ఆ నిఘా పరికరాలు తన సొంత దేశంలో సృష్టించిన పెనువివాదంలో చిక్కుకుంది. మాజీ ప్రధాన మంత్రి నెతన్యాహు కుమారుడు, ప్రధాన అనుచరులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులపై పోలీసులు పెగాసస్ పరిజ్ఞానంతో నిఘా ఉంచారని ‘కెల్కలిస్ట్’ అనే పత్రిక వరుసగా ప్రచురించిన కథనాలు తీవ్ర కలకలం రేపాయి. రాజకీయంగాను, వివిధ వర్గాల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హర్జోగ్, ప్రధాని నఫ్తాలి బెనెట్, కేబినెట్ మంత్రులు నిఘా వ్యవహారాన్ని ఖండించారు. పోలీసులు స్పైవేర్ను వినియోగించినట్లు వస్తున్న ఆరోపణలు నిజమే అయితే తీవ్రంగా పరిగణించాల్సిన విషయమేనని ప్రధాని నఫ్తాలి బెనెట్ పేర్కొన్నారు. పోలీసులు అధికార పరిధిని అతిక్రమించినట్లుగా వచ్చిన ఆరోపణలపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజా భద్రత శాఖ మంత్రి ఒమర్ బర్లేవ్ ప్రకటించారు. పోలీసు విభాగం అతని పరిధిలోనే ఉంటుంది.
ఎన్ఎస్ఓ గ్రూప్ విక్రయించిన పెగాసస్ స్పైవేర్ సాంకేతికతను వినియోగించి భారత్ సహా వివిధ దేశాల ప్రభుత్వాలు.. పాత్రికేయులు, మానవహక్కుల ఉద్యమకారులు, రాజకీయ నాయకులపై నిఘా ఉంచినట్లు వచ్చిన వార్తలు గత ఏడాది తీవ్ర వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే విధంగా ఇజ్రాయెల్ పోలీసులు కూడా ఈ అత్యాధునిక నిఘా పరిజ్ఞానాన్ని మాజీ ప్రధాని నెతన్యాహు కుమారుడు అన్వర్, నెతన్యాహు ప్రధాన అనుచరులు, సలహాదారులు, ఉన్నతాధికారులు, పాత్రికేయులు, వ్యాపారవేత్తల ఫోన్లలోకి చొప్పించి నిఘా ఉంచినట్లు ‘కెల్కలిస్ట్’ పత్రిక పేర్కొంది. నెతన్యాహు ప్రభుత్వ హయాంలోని ఆర్థిక, న్యాయశాఖ ఉన్నతాధికారులు, రవాణా, సమాచార శాఖ మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల నాయకులు తదితరులపై కూడా పెద్ద ఎత్తున నిఘా కొనసాగినట్లు పత్రిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM