Dinosaur: మధ్యప్రదేశ్లో డైనోసార్ రాతి గుడ్లు.. వాటి బరువెంతో తెలుసా?
భూమి మీద అతిపెద్ద ప్రాణులుగా గుర్తింపు పొంది, చాలాకాలం కిందటే అంతరించిపోయిన డైనోసార్ల గుడ్లు శిలాజీకరణ రూపంలో
ఇండోర్: భూమి మీద అతిపెద్ద ప్రాణులుగా గుర్తింపు పొంది, చాలాకాలం కిందటే అంతరించిపోయిన డైనోసార్ల గుడ్లు శిలాజీకరణ రూపంలో ఇప్పటికీ అక్కడక్కడా బయటపడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని బడవానీ అడవిలో 10 డైనోసార్ రాతి గుడ్లను కనుగొన్నారు. పురాతత్వ శాస్త్రవేత్తల కథనం మేరకు.. ఇవి కోటి సంవత్సరాల కిందటి డైనోసార్ గుడ్లు. సెంధ్వా జిల్లాలోని వర్ల గ్రామం ఈ ఆసక్తికరమైన వార్తకు కేంద్రంగా మారింది. పురాతన శిల్పాలు, కోటలపై గత జనవరి 30న సర్వే ప్రారంభించిన పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ డి.పి.పాండే ఫిబ్రవరి 5వ తేదీన అటవీ సిబ్బందితోపాటు వర్ల తహసీల్లోని హింగ్వా గ్రామ సమీప అడవికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న రాతి గుడ్లు పాండే కంటపడ్డాయి. వాటిలో ఒక గుడ్డు 40 కేజీలు ఉండగా, మిగతావి 25 కేజీల మేర ఉన్నాయి. వీటిని ఇండోర్ మ్యూజియంలో ఉంచనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల