పెళ్లితో ఒక్కటైన ట్రాన్స్జెండర్ల జంట.. దేశంలో ఇదే తొలిసారి!
కేరళలో అరుదైన పెళ్లి జరిగింది. ఇద్దరు ట్రాన్స్జెండర్లు వివాహం చేసుకున్నారు. లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు వ్యక్తులు
కేరళలో అరుదైన పెళ్లి జరిగింది. ఇద్దరు ట్రాన్స్జెండర్లు వివాహం చేసుకున్నారు. లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. ప్రేమికుల రోజునే ఈ పెళ్లి జరగడం విశేషం. ట్రాన్స్జెండర్లైన శ్యామ ఎస్ ప్రభ, మను కార్తిక పదేళ్లుగా స్నేహితులు. కార్తిక ఓ ప్రైవేటు సంస్థ మానవ వనరుల విభాగంలో ఉద్యోగి. కేరళ ప్రభుత్వ సంక్షేమ శాఖ ట్రాన్స్జెండర్ విభాగం సమన్వయకర్త. ఐదేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లింగమార్పిడి చేయించుకున్నారు. ప్రేమికుల రోజున తిరువనంతపురంలో బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ రకమైన వివాహం చట్టబద్ధం కాదు. దీనిపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. తమ పెళ్లి ట్రాన్స్జెండర్ వివాహాల్లో సరికొత్త మైలురాయి కానుందని ఈ సందర్భంగా ప్రభ, మను తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: ‘ఉత్తమ విలన్’పై లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్